• About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us
  • Work With Us

Andhra Pradesh and Telengana State News Daily

AP and TS News at Your Fingertips

  • AP News
  • TS News
  • National News
  • International
  • Business
  • Education
  • Sports
  • Entertainment
  • Technology

వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్

June 29, 2017 by Bhagya Leave a Comment

వాట్సప్ వినియోగదారులకు మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది.  దీంతో ఎలాంటి ఫైల్‌నైనా షేర్ చేసుకునే సదుపాయం వుంటుంది.  ఇది అందుబాటులోకి వస్తే ఫొటోలు, వీడియోలు, జిప్ ఫైల్స్ కాకుండా పీడీఎఫ్‌లు, వర్డ్ డాక్యుమెంట్లు, పవర్ పాయింట్ స్లైడ్స్‌ను సైతం షేర్ చేసుకోవచ్చు.

Filed Under: Technology

ఫ్రెంచి గయానా నుంచి విజయవంతంగా జీశాట్‌-17 ప్రయోగం

June 29, 2017 by Bharath Leave a Comment

వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో మరో ఘన విజయం సాధించింది. నెలరోజుల వ్యవధిలోనే మూడు ప్రయోగాలతో సంచలనం సృష్టించింది. ఫ్రెంచ్ గయానా అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-17 విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో.. ఫ్రాన్స్‌కు చెందిన  ఏరియన్‌ స్పేస్- 5 E C A రాకెట్ ద్వారా జీశాట్‌ను ప్రయోగించారు.

ఈ నెల 5న ఇస్రో బాహుబలి రాకెట్ జీశాట్-19 ప్రయోగించింది. అదే క్రమంలో.. 3వేల 425 కిలోల బరువు మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న జీశాట్-17ను భారత కాలప్రకారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రయోగించారు. వాస్తవానికి జీశాట్‌ను 2 గంటలా 29 నిమిషాలకు ప్రయోగించాల్సి ఉన్నా.. సాంకేతిక కారణాలతో ప్రయోగం కొంత ఆలస్యమైంది. జీశాట్‌ సక్సెస్‌తో సమాచార రంగంలో ట్రాన్స్‌పాండర్ల కొరతను ఇస్రో అధిగమించనుంది.
భూస్థిర కక్ష్యలోకి ప్రవేశించిన జీశాట్-17 పదిహేనేళ్లపాటు సేవలందించనుంది. కమ్యూనికేషన్ సేవలు, డేటా ప్రసారాలు, సహాయకచర్యలకు ఇది ఉపకరించనుంది. 3.4 టన్నుల బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించే సదుపాయాలు మన వద్ద లేనందున ఫ్రెంచి గయానా నుంచి దీనిని ప్రయోగించారు. జీశాట్‌తో పాటు హెల్లాస్‌ శాట్‌-3 ను కూడా ఏరియన్‌ కక్ష్యలో ప్రవేశపెట్టింది. జీశాట్‌ భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో పరిభ్రమిస్తుంది. రాబోయే కాలంలో ఇస్రోకు చెందిన 5 వేల కిలోల బరువున్న జీశాట్‌-11ను కూడా ఏరియన్‌ స్పేస్ ద్వారానే ప్రయోగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Filed Under: Technology

మే 5న నింగిలోకి సౌత్ ఏషియా శాటిలైట్

May 1, 2017 by Usha Leave a Comment

భారత ప్రధాని సార్క్ దేశాలకు అరుదైన బహుమతి అందించనున్నారు, శాస్త్రవేత్తల మేధస్సుతో పొరుగుదేశాల అభివృద్ధికి చేయందించనున్నారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు తీసుకున్న కొన్ని వారాల తర్వాత  ఇస్రో శాస్త్రవేత్తలను నరేంద్ర మోడీ అడిగిన సార్క్ శాటిలైట్ కోరిక త్వరలో తీరబోతోంది. మూడేళ్లలో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రధాని కోరిక ప్రకారం సార్క్ శాటిలైట్ రూపొందించారు. కానీ పాకిస్తాన్ ప్రాజెక్టు నుంచి వైదొలగడంతో దీనికి సౌత్ ఏషియా శాటిలైట్‌గా నామకరణం చేశారు. మోడీ విదేశాంగ విధానాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లేలా మే 5న దీన్ని ప్రయోగించనున్నారు. సౌత్ ఏషియా శాటిలైట్‌ను 450 కోట్ల వ్యయంతో రూపొందించారు. జీశాట్ 9 అనే ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ ద్వారా దక్షిణ ఆసియాలో భారత్ తనదైన ముద్ర వేయనుంది. టెలీ కమ్యూనికేషన్, బ్రాడ్ కాస్టింగ్ రంగంలో పొరుగుదేశాలకు పూర్తి స్థాయి అప్లికేషన్స్, సేవలు అందించనుంది.  మే 5న ఈ శాటిలైట్ ప్రయోగంతో సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదం దేశాన్ని దాటి వెళ్లబోతోందని మన్ కీ బాత్ చెప్పారు మోడీ. పాక్ మినహా సౌత్ ఏషియా శాటిలైట్ ప్రాజెక్ట్‌లో భాగమైన నేపాల్, భూటాన్, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, శ్రీలంకకు దీని ద్వారా లబ్ధి చేకూరనుంది. సౌత్ ఏషియా శాటిలైట్  దేశంలో ఆర్థికాభివృద్ధికి ఊతం ఇవ్వడంతోపాటూ పొరుగు దేశాల అభివృద్ధికి కూడా తోడ్పడనుంది. ఈ ఉపగ్రహంలో 12 KU  బాండ్ ట్రాన్స్‌పాండర్స్ ఉంటాయి. వీటి ద్వారా పొరుగు దేశాలు తమ కమ్యూనికేషన్ మెరుగుపరుచుకోవచ్చు. కనీసం ఒక ట్రాన్స్‌పాండర్‌ను ఉపయోగించి అవి తమ సొంత ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు.

Filed Under: Technology

రష్యా రికార్డును బ్రేక్ చేయబోతున్నభారత్: కక్ష్యలోకి ఒకేసారి 104 ఉపగ్రహాలు

February 8, 2017 by Bhagya Leave a Comment

అనుకున్న సమయం రానే వచ్చింది.  సైంటిస్టుల పరిశోధనలు విజయవంతమయ్యే రోజు రాబోతుంది. భాతర అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టడానికి రంగం సిద్ధం చేసింది.  ఈ అపురూప దృశ్యాన్ని ఈ నెల 15న చూడబోతున్నాం.  1500 కిలోల బరువుండే ఈ ఉపగ్రహాలను 320 టన్నుల పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ సీ37) సౌరకక్ష్యలోకి ప్రవేశపెడుతుంది.  గత ఏడాది జూన్ 22న ఒకే రాకెట్‌లో 20 ఉపగ్రహాలను ప్రయోగించి రికార్డును నెలకొల్పిన భారత్ ఇప్పుడు ఏకంగా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబోతోంది.  2014లో రష్యా 37 ఉపగ్రహాలను ప్రవేశపెట్టడమే పెద్ద రికార్డు.  ఇప్పుడు ఆ రికార్డును భారత్ బ్రేక్ చేయబోతోంది.

Filed Under: Technology

ఈ నెల 15న పీఎస్‌ఎల్‌వీ సి-37 ప్రయోగం

February 8, 2017 by prasanna Leave a Comment

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గగనంలో మరో ఘనతను  సొంతం చేసుకోబోతోంది. గత దశాబ్ద కాలంలో అనేక ప్రతిష్ఠాత్మక ప్రయోగాలతో  దేశ ఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు చేర్చిన షార్‌ ఇప్పుడు ఏకంగా ప్రపంచానికే సవాల్‌ విసరబోతోంది. మంగళ్‌యాన్‌, చంద్రయాన్‌-1 వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు విజయవంతం చేసిన ఆత్మవిశ్వాసంతో ఈ ఏడు సరికొత్త  అధ్యాయాన్ని లిఖించేందుకు సిద్ధమైంది. ఒకేసారి ఒకే రాకెట్‌ ద్వారా 108 ఉపగ్రహాలను ప్రయోగించే అరుదైన సవాల్  అందుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఆ సువర్ణ అధ్యాయానికి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) వేదిక  కాబోతోంది. ఫిబ్రవరి 15న  ఉద‌యం 9.28గంట‌ల‌కు పీఎస్‌ఎల్‌వీ-సి37 రాకెట్‌ ద్వారా మన దేశానికి  చెందిన కార్టోశాట్‌-2డి ఉపగ్రహం సహా 108 ఉపగ్రహాలు  ప్రయోగించనుంది.

Filed Under: Technology

ఒకేసారి 103 ఉపగ్రహాలను పంపనున్నఇస్రో

January 29, 2017 by Bhagya Leave a Comment

ఇస్రో సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలంటూ రాజమండ్రిలో నమూనా ప్రదర్శన చేపట్టారు. వందల మంది విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. PSLV-C37 ద్వారా ఒకేసారి 103 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. దీనికి సంబంధించిన నమూనా సిద్దం చేసి… నగరంలో ర్యాలీ నిర్వహించారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పట్ల విద్యార్ధులు చూపుతున్న ఆసక్తిని ఎంపీ మురళీమోహన్ ఈ సందర్భంగా కొనియడారు. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు.

Filed Under: Technology

మార్కెట్లోకి పొల్యూషన్ రహిత టాటా మోటర్స్ ‘ఎలక్ట్రిక్ బస్సు’

January 26, 2017 by Bharath Leave a Comment

టాటా మోటార్స్ పొల్యూషన్ రహిత ఎలక్ట్రిక్, హైబ్రిడ్ బస్సులను మార్కెట్లోకి రిలీజ్ చేసినట్టు ప్రకటించింది. ఈ బస్సుల ధర రూ.1.6 కోట్ల నుంచి రూ.2 కోట్ల మధ్య ఉంటుందని తెలిపింది. ఈ సందర్భంగా ‘టాటా మోటార్స్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్ర మాట్లాడుతూ…. అవసరాలకు అనుగుణంగానే కాకుండా, పర్యావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాహనాలను తయారు చేస్తున్నామని అన్నారు. హైబ్రిడ్ బస్సులకు సంబంధించిన 25 వాహనాలను తయారు చేయాలని ఇప్పటికే తమకు ఆర్డర్ ఉందని, ప్రజా రవాణాకు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.

Filed Under: Technology

10లక్షల గూగుల్‌ అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయి..!

December 2, 2016 by Bharath Leave a Comment

10lakh-google-accounts-hacked
ఇది ఖచ్చితంగా లైట్‌ తీసుకోవాల్సిన ఇష్యూ కాదు. ఎందుకంటే..ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా 10లక్షల గూగుల్‌ అకౌంట్ల పాస్‌వర్డ్‌తో పాటు డేటాను హ్యాకర్స్‌ ఇప్పటికే దోచేసినట్టు తేలింది. మరిన్ని అకౌంట్లపై దాడులకు పక్కాగా ప్లాన్‌ చేసినట్టు కూడా చెక్‌పాయింట్‌ అనే సంస్ధ బయటపెట్టింది. ఈ ఏడాది మొదటి నుంచి హ్యాకర్లు కొత్త మాల్‌వేర్‌ను తయారుచేసి హ్యాకింగ్‌కు ప్రయత్నిస్తున్నట్టు ఆ సంస్ధ తేల్చింది. ఇంతకీ.. హ్యాక్‌ చేసిన అకౌంట్లలో మీ అకౌంట్‌ ఉందా లేదా? మీ మెయిల్‌ అకౌంట్‌తో హ్యాకర్లు ఏం చేయబోతున్నారు? చూద్దాం..
ఇంటర్నెట్‌లో అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉండే గూగుల్‌ అకౌంట్ల డేటాను ఈ సారి హ్యాకర్లు టార్గెట్‌ చేశారు. అయితే, నేరుగా సర్వర్ల నుంచి కాకుండా.. యూజర్ల నుంచి వారి ఈమెయిల్‌ అకౌంట్లు, పాస్‌వర్డ్‌లు దొంగిలించినట్టు చెక్‌ పాయింట్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ అనే సంస్ధ చెబుతోంది. గూగుల్‌ప్లే, జీమెయిల్‌, గూగుల్‌ ఫోటోస్‌, గూగుల్‌ డాక్స్‌, గూగుల్‌ డ్రైవ్‌తో సహా గూగుల్‌కు అనుసంధానమైన అన్ని సర్వీసుల యాక్సెస్‌ను దొంగిలించిన అకౌంట్ల నుంచి పొందగలిగినట్టు పేర్కొంది. SnapPea అనే యాప్‌ ద్వారా గూలిగన్‌ అనే మాల్‌వేర్‌ను స్మార్ట్‌ఫోన్లలోకి పంపించిన హ్యాకర్లు..గూగుల్‌ అకౌంట్‌ డేటాను చోరీ చేసినట్టు తేలింది. ముందుగా ఎటాకర్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సర్వర్‌ ద్వారా థర్డ్‌ పార్టీ యాప్స్‌ని ఉపయోగించి స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్‌ అవుతాడు. యాప్‌ ద్వారా మాల్‌వేర్‌ను మొబైల్‌లోకి పంపడం ద్వారా.. దానిపై యాక్సెస్‌ సంపాదిస్తారు. వెంటనే ఫోన్‌ని రూట్‌ చేయడంచ గూగుల్‌ప్లే లోకి కోడ్‌ని పంపించడం ద్వారా.. మనకు తెలియకుండానే రకరకాల యాప్స్‌ని మన ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేస్తారు.
మాములుగా యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేయాలంటే యాండ్రాయిడ్‌ యూజర్స్‌ గూగుల్‌ ప్లేను వినియోగిస్తారు. కొంతమంది థర్డ్‌ పార్టీ యాప్స్‌ ద్వారా ఇన్‌స్టాల్‌ చేసుకుంటారు. సరిగ్గా ఇలాంటి యాప్స్‌ నుంచే గూలిగన్‌ అనే మాల్‌వేర్‌ ఫోన్‌లోకి ఇంజెక్ట్‌ అవుతుంది. కొన్నిసార్లు యూజర్స్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో లింక్స్‌ పంపించడం,, వాటికి క్లిక్‌ చేయగానే మాల్‌వేర్‌ డౌన్‌లోడ్‌ అయ్యేవిధంగా కూడా ప్లాన్‌ చేశారు. 2016 మొదటికి దాదాపు మాల్‌వేర్‌ల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఫోన్లలోనే బ్యాంకింగ్‌ పెరిగిపోవడంతో.. సెక్యూరిటీ ఫీచర్స్‌ పెరగడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. అయితే, ఈ ఏడాది మొదటికి కాంప్లెక్స్‌ ఆర్కిటెక్చర్‌తో మళ్లీ మాల్‌వేర్‌లు పెరిగిపోయాయి. కుప్పలుతెప్పలుగా యాప్‌లు పెరిగిపోవడం, ఏ యాప్‌ ఒరిజినలో తెలియక చాలామంది అన్నిటినీ డౌన్‌లోడ్‌ చేయడంతో ఇలాంటి చిక్కులు వస్తున్నాయంటున్నారు సైబర్‌ ఎక్స్‌పర్ట్స్‌.
గూలిగన్‌ అనే ఈ మాల్‌వేర్‌ ఎక్కువగా జెల్లీబీన్‌, కిట్‌కాట్‌ ఇన్‌స్టాల్‌ చేయబడిన యాండ్రాయిడ్‌ 4, యాండ్రాయిడ్‌ 5లోని లాలీపాప్‌ వెర్షన్లపై ఎక్కువగా పనిచేసినట్టు తేలింది. ప్రపచంలోని మార్కెట్లలో 74శాతం ఈ వెర్షన్‌ ఉన్న ఫోన్లే ఎక్కువగా ఉన్నాయి. ఆసియాలో దాదాపు 57శాతం ఉన్నట్టు తేలింది.
దొంగిలించిన డేటాను హ్యాకర్లు వివిధ రకాలుగా వినియోగిస్తున్నారు. అయితే, ప్రధానంగా యాప్‌లకు రేటింగ్‌ పెంచుకోవడానికే ప్రధానంగా వినియోగిస్తున్నట్టు తేలింది. మనకు తెలియకుండానే ఇన్‌స్టాల్‌ అయిన యాప్‌లకు మనపేరుతో రివ్యూలు రాసేవిధంగా కోడ్‌ తయారుచేసినట్టు చెబుతున్నారు టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్స్‌.
10లక్షల గూగుల్‌ అకౌంట్లు అంటే తక్కువే కావచ్చు. కానీ.. రోజురోజుకూ ఈ సంఖ్య పెరిగిపోవడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. అయితే, మీ మెయిల్‌ ఐడీ హ్యాక్‌ అయిందో లేదో తెలుసుకోవడానికి చెక్‌పాయింట్‌ సంస్ధ ఏర్పాట్లు చేసింది. ఒకవేళ హ్యాక్‌ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వివరిస్తోంది.
హ్యాక్‌ అయిన 10లక్షల గూగుల్‌ అకౌంట్లలో మీ అకౌంట్‌ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా? ఒకవేళ హ్యాక్‌ అయితే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇకమీదట మీ ఫోన్‌ హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి. హ్యాక్‌ అయిన అకౌంట్లలో మీ అకౌంట్‌ ఉందో లేదో తెలుసుకోవాలంటే కొన్ని చిన్న చిన్న స్టెప్స్‌ ఫాలో అయితే సరిపోతుంది. ఈ హ్యాకింగ్ స్కాండల్‌ని బయటపెట్టిన
ఇప్పుడు మీరు చూసిన అకౌంట్‌ హ్యాక్‌ అవలేదు. అంటే ఎలాంటి ప్రాబ్లెం లేదు. ఒకవేళ హ్యాక్‌ అయినట్టు వస్తే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు సైబర్‌ నిపుణులు.
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌ మొత్తాన్నీ క్లీన్‌ ఇన్‌స్టాల్‌ చేయాలి. దాన్ని ఫ్లాషింగ్‌ అని పిలుస్తారు. మొబైల్‌ డివైజ్‌ని రీఫ్లాష్‌ చేయాలంటే కంపెనీ ఆధరైజ్డ్‌ టెక్నీషియన్‌ని సంప్రదించవచ్చు. గూగుల్‌ అకౌంట్‌ పాస్‌వర్డ్‌ని వెంటనే మార్చుకోవాలి. సామాన్యంగా ఏటీఎం పిన్‌ను ఎలాగైతే రెండుమూడు నెలలకు ఓ సారి మారుస్తామో.. మెయిల్‌ పాస్‌వర్డ్‌ని కూడా మార్చాలని సూచిస్తున్నారు నిపుణులు
మార్కెట్లో రకరకాల యాప్‌ ఇన్‌స్టాల్‌ సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటి నుంచి కాకుండా.. గూగుల్‌ ఆధరైజ్డ్‌ ప్లేస్టోర్‌ ద్వారానే యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మాల్‌వేర్‌ మీ స్మార్ట్‌ఫోన్‌కి చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే.. ఫోన్‌లోని డేటాతో పాటు అకౌంట్‌ను కూడా సేఫ్‌గా ఉంచుకోవచ్చు.

 

Filed Under: Technology

శామ్‌సంగ్ ఫోన్లే కాదు వాషింగ్ మెషీన్‌లు కూడా పేలుతున్నాయి

November 7, 2016 by prasanna Leave a Comment

samsung-to-recall-millions-of-exploding-washing-machines
ఈ మధ్య తరచుగా శామ్‌సంగ్ పోన్లు పేలిపోతున్నాయనే కారణంగా ఆ కంపెనీ వాటిని రీకాల్ చేసింది. ఇప్పుడు వాషింగ్ మెషీన్ కు కూడా పేలుడు ముప్పు వుంటుందంటోంది శాంసంగ్. తాము విడుదల చేసిన టాప్‌లోడ్ వాషింగ్ మెషీన్ మోడల్ ఒక దానిలో లోపం ఉందని కంపెనీ తెలిపింది.  ఈ లోపం వల్ల మెషీన్ బ్యాలెన్స్ కోల్పోవచ్చు.  అతిగా వైబ్రేట్ కావచ్చు.  కొన్ని అరుదైన కేసుల్లో పేలవచ్చని వివరించింది.  అందువల్ల వీటి వాలంటరీ రీకాల్‌కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించింది.  ఇప్పటివరకు 28 లక్షలకు పైగా వాషింగ్ మెషీన్లు విక్రయించినట్లు సమాచారం.  మెషీన్‌లో ఉద్దేశించిన హైస్పీడ్ సైకిల్ వల్ల డ్రమ్ బ్యాలెన్స్ కోల్పోయి , మెషీన్ విపరీతంగా వైబ్రేట్ అయి మెషీన్ పై భాగం ఊడి విడిపోతుందని పలు ఫిర్యాదులు అందాయి.  ఈ వాషింగ్ మెషీన్లు పేలే ప్రమాదం ఉందని తెలిసి కూడా శాంసంగ్ వాటిని విక్రయిస్తుందని ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలని అమెరికా కోర్టుల్లో కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి.

Filed Under: Technology

ఐరోపా అంతరిక్ష సంస్థకు ఎదురు దెబ్బ

October 23, 2016 by Bharath Leave a Comment

mars-lander-crashed-and-exploded
మార్స్‌ ఉపరితలంపైకి ఐరోపా అంతరిక్ష సంస్థ పంపిన స్కాపరెల్లీ ల్యాండర్‌ పేలిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్స్‌పై దిగడానికి ఉద్దేశించిన రాకెట్లు నిర్ణీత సమయం కన్నా ముందుగానే ఆగిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అంతరిక్షం నుంచి అందిన ఫొటోలను చూసిన శాస్త్రవేత్తలు, ఆ ల్యాండర్‌పై ఆశలు వదులుకున్నారు. ఐరోపా అంతరిక్ష సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. అంగారకుడి ఉపరితలంపైకి ఆ సంస్థ పంపిన స్కాపరెల్లీ ల్యాండర్‌.. ఆ గ్రహం ఉపరితలాన్ని ఢీకొట్టి, పేలిపోయి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంగారకుడి కక్ష్యలో తిరుగుతున్న అమెరికా ఉపగ్రహం ఎంఆర్‌వో పంపిన ఫొటోలను విశ్లేషించి ఈ మేరకు అంచనా వేస్తున్నారు. స్కాపరెల్లీ ల్యాండర్‌ నెల 19న ట్రేస్‌ గ్యాస్‌ ఆర్బిటర్‌ వ్యోమనౌక నుంచి విడిపోయి.. మార్స్ వాతావరణంలోకి ప్రవేశించింది. అయితే మార్స్ ఉపరితలాన్ని తాకడానికి కొన్ని సెకన్ల ముందు ఆ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. తాజాగా అమెరికా ఉపగ్రహంలోని సీటీఎక్స్‌ కెమెరా.. అంగారకుడి ఉపరితలంపై కొన్ని వస్తువులను గమనించింది. స్కాపెరెల్లీ దిగాల్సిన ప్రదేశంలోనే ఇవి ఉన్నాయి. ఇందులో ఒకటి ఈ ల్యాండర్‌కు సంబంధించిన 12 మీటర్ల పారాచూట్‌గా భావిస్తున్నారు. దీనికి ఉత్తరాన కిలోమీటరు దూరంలో మరో ఆకృతి కనిపించింది. స్కాపెరెల్లీ మాడ్యూల్‌ ఢీ కొట్టడంవల్ల ఇది ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.స్కాపెరెల్లీ వేగాన్ని తగ్గించి, ఉపరితలంపై సాఫీగా దిగేలా చేయడం కోసం అమర్చిన రాకెట్లు నిర్దేశించిన సమయం కన్నా ముందుగానే ఆగిపోయి ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. ఫలితంగా వ్యోమనౌక గంటకు 300 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో అంగారక ఉపరితలాన్ని ఢీ కొట్టి ఉంటుందని.. ఈ క్రమంలో ఇంధన ట్యాంకులు పేలిపోయి ఉంటాయని భావిస్తున్నారు.

Filed Under: International, Technology

  • 1
  • 2
  • Next Page »
  • Facebook
  • Google+
  • Instagram
  • Tumblr
  • Twitter
  • YouTube
Centre hands over Assam youth leader Lafiqul Islam murder case to CBI for investigation

Centre hands over Assam youth leader Lafiqul Islam murder case to CBI for investigation

Nine coaches of Nagpur-Mumbai Duronto Express derail near Asangaon

Nine coaches of Nagpur-Mumbai Duronto Express derail near Asangaon

Prime Minister to inaugurate National Highway projects in Rajasthan today

Prime Minister to inaugurate National Highway projects in Rajasthan today

PM Modi says through Jan Dhan Yojana and other welfare schemes, government has given wings to millions of aspirations

PM Modi says through Jan Dhan Yojana and other welfare schemes, government has given wings to millions of aspirations

Rape convict Dera Saccha Sauda Chief Gurmeet Singh’s quantum of punishment to be pronounced

More Posts from this Category

Bangladesh gain upper hand in opening Cricket Test against Australia

Bangladesh gain upper hand in opening Cricket Test against Australia

Sharapova return to Grand Slam Tennis after defeating Halep in US Open

Sharapova return to Grand Slam Tennis after defeating Halep in US Open

India win SAFF Under 15 Championship

India win SAFF Under 15 Championship

పద్మభూషణ్‌కు పీవీ సింధు పేరు సిఫారసు

పద్మభూషణ్‌కు పీవీ సింధు పేరు సిఫారసు

క్రికెటర్‌ శ్రీశాంత్‌కు ఊరట

క్రికెటర్‌ శ్రీశాంత్‌కు ఊరట

మిథాలి సేనకు బీసీసీఐ భారీ నజరానా

మిథాలి సేనకు బీసీసీఐ భారీ నజరానా

భారత్ వర్సస్ ఇంగ్లాండ్: మిథాలీ సేనా పై భారీ అంచనాలు

భారత్ వర్సస్ ఇంగ్లాండ్: మిథాలీ సేనా పై భారీ అంచనాలు

8వ సారి వింబుల్డన్‌ టైటిల్ గెలిచిన స్విస్ స్టార్‌ ఫెదరర్‌

8వ సారి వింబుల్డన్‌ టైటిల్ గెలిచిన స్విస్ స్టార్‌ ఫెదరర్‌

Recent Posts

  • JEE Main Result
  • JEE Main Notification
  • అధికార పార్టీ దెబ్బకు అధికారుల హడల్..
  • నారా వారి పల్లిలో సంక్రాంతి సందడి..
  • పొత్తులపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు!
  • జీహెచ్‌ఎంసీలో ట్రాన్స్‌పోర్ట్‌ స్కామ్.. నలుగురి అరెస్ట్
  • పవన్ అభిమానిపై బాలయ్య అభిమాని దాడి…

Copyright © 2019 · News Pro Theme on Genesis Framework · WordPress · Log in